Type Here to Get Search Results !

Sports Ad

పాఠశాల అభివృద్ధి కోసం 2 లక్షలు విరాళం 2 lakhs donation for school development

 

పాఠశాల అభివృద్ధి కోసం 2 లక్షలు విరాళం

- బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్

పెద్దేముల్ : తన తండ్రి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు స్వర్గీయ కోహిర్ మల్లయ్య జ్ఞాపకం తనయుడు బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ పాఠశాల అభివృద్ధి కోసం 2 లక్షలు విరాళం ప్రకటించారు.74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని సిపిఎస్ పాఠశాలను టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ సందర్శించినట్లు శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల తరగతుగదులను,తాగునీటి సౌకర్యం,మరుగుదొడ్ల వసతులను పరిశీలించినట్లు తెలిపారు.వేసవికాలంలోపు వీటిని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవతో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపిస్తానని హామీ ఇచ్చారు.వచ్చే పంద్రాగస్టు రోజున తన తండ్రి జ్ఞాపకార్థం రెండు లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు.రెండు లక్షల రూపాయలను పాఠశాల అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.పాఠశాల అభివృద్ధి కోసం రెండు లక్షల ప్రకటించడంతో పలువురు గ్రామస్తులు,ప్రజా ప్రతినిధులు,ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.అనంతరం పాఠశాల సిబ్బంది కోహిర్ శ్రీనివాసుని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి. పాఠశాల చైర్మన్ రాములు,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies