Type Here to Get Search Results !

Sports Ad

ఫిబ్రవరి 3న చలో హైదరాబాద్ BSSM Chairman Samuel

 


ఫిబ్రవరి 3న చలో హైదరాబాద్ 

- రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతావలె అధ్వర్యంలో 
- నియామక పత్రం,ప్రమాణ స్వీకారం 

భద్రాద్రి కొత్తగూడెం : రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతావలే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు తీసుకున్న మద్దిశెట్టి సామేలు గారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రాందాస్ అతావలే గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామక పత్రాన్ని మరియు పూర్తి భాద్యతలు మీద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ గా దిశగానీ సంపత్ గౌడ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.తేదీ 03.02.2023 నాడు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియం లో మధ్యాహ్నం 2.00 లకు ప్రమాణ స్వీకారం జరగనుంది.మద్దిశెట్టి సామేలు గారికి జరిగే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అన్ని జిల్లాల,మండలాల కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాము.రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతావలే నేషనల్ కౌన్సిల్ మెంబర్ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ గారికి,నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ప్రభుదాస్ గారికి,తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ.ఫయాజ్ మరియు ఆర్పీఐ పార్టీ కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


కాల్లురి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన మద్దిశెట్టి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండేపుడి గ్రామానికి కాల్లూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు రాజ్ కుమార్ మరణించారని తెలుసుకొని వారి కుటుంబాన్ని  BSSM తెలంగాణ రాష్ట్ర మద్దిశెట్టి సామేలు గారు మరియు వారి టీమ్ పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో BSSM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి రవి,ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు, జూలూరుపాడు మండల అధ్యక్షులు భూక్యా రవి, మండల కార్యదర్శి బానోత్ సుదర్శన్,కొడెం సీతాకుమారి,కుదురుపాక నిర్మల,బొర్రా నాగమణి,అజ్మీరా విజయ,చండ్రుగొండ మండల అధ్యక్షులు కిన్నెర శేషు,మండల ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies