కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని తెలంగాణ చీఫ్ బండి సంజయ్ Bandi Sanjay కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర గవర్నర్ ను పట్టించుకోవడంలేదు,గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు.నేడు మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.అసలు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు.ఇక ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెట్టారని అన్నారు.రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిపై కూడా అప్పులు మోపిన ఘనత కేసీఆర్ సర్కార్ దే అన్నారు.కేసీఆర్ Cm KCR ఏ దేశం గురించి మాట్లాడితే ఆ దేశం దివాళా తీస్తుంది.