బిజెపి కి భారీ షాక్
- తాండూర్ అభివృద్ధి,యువకులు జై రోహితన్న
తాండూర్ : తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి చూసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన రాఘవాపూర్ యువకులు.యాలాల మండలం రాఘవాపూర్ ఉప సర్పంచ్ మ్యాతరి నర్సిములు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి చేతుల మీదుగా బిఆర్ఎస్ లో చేరారు. తాండూర్ నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చెందుతుందని మేము సైతం రాఘవపూర్ అభివృద్ధికి కోసం గౌరవ ఎమ్మెల్యే గారి వెన్నంటు ఉండి తన ఆదేశానుసారం పని చేస్తామని అన్నారు.గడిచిన 25 సంవత్సరాలనుండి లేని అభివృద్ధిని కేవలం నాలుగు సంవత్సరాలలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు చేస్తున్నారని అన్నారు.ఎన్నడూ లేని విధంగా తాండూర్ అభివృద్ధి కి 134.50,కోట్లతో అభివృద్ధికి పూనుకున్నారు ప్రతి గ్రామపంచాయతీ కి 50 లక్షలు పట్టణంలో ఒక్కో వార్డుకు కోటి రూపాయల నిధులను తీసుకురావడం ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులకి నిదర్శనం.ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో తాండూర్ అభివృద్ధికి పాటుపడటం తాండూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ మ్యాతరి నర్సిములు తో పాటు వడ్డె సురేష్,వడ్ల రాజు బహదూర్ శ్రీనివాస్,సంగెమ్ గోపాల్,రాజేశ్వర్ రెడ్డి, షేక్ సలీమ్,బోయిని అశోక్,సంగెమ్ సుభాష్,ధన్నారం శ్రీనివాస్,బహదూర్ నర్సిములు,యాకుబ్,కంజాపూర్ పాండు,బహదూర్ సాయి కుమార్,కంజాపూర్ శ్రావణ్ తదితరులు పాల్కొన్నారు.
ఎమ్మెల్యే గారిని కలిసిన బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం సభ్యులు
హైదరాబాద్ : హైదరాబాదులోని ఎమ్మెల్యే గారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన తాండూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు అనిల్ బాండ్ మరియు యువకులు.అలాగే తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయాల పైన మరియు పలు అంశాల పైన చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల గంగాధర్,మైనార్టీ నాయకులు టిప్పు సుల్తాన్,యువ నాయకులు ఆర్మీ అనిల్,రఫీ,అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.