పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒకరు మృతి
- పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి
కొండగట్టు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిచారు.అనంతరం తన ప్రచార రథం 'వారాహి'కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించిన తర్వాత దాన్ని ఆయన ప్రారంభించారు.పవన్ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయన్ను సత్కరించారు. అభిమానులకు ఓపెన్టాప్ వాహనం నుంచి పవన్ అభివాదం చేశారు.జగిత్యాల జిల్లా పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తుండగా అయితే ధర్మపురి నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని ఫాలో అయిన పవన్ అభిమానులు.ఈ క్రమంలో వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద రోడ్డు ప్రమాదం ఓ యువకుడి మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ సంధర్బంగా మృతదేహం ధర్మపురి మార్చారీకి తరలించారు.