జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
- ముఖ్య అతిథిగా భారస జిల్లా అధ్యక్షులు మాలోత్ కవితమ్మ
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ఆధ్వర్యంలో
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో భాగంగా ముఖ్య అతిథిగా భారస జిల్లా అధ్యక్షులు మాలోత్ కవితమ్మ పాల్కొన్నారు.ఈ రోజు ఫైనల్లో గెలుపొందిన ఆటగాళ్లకు బహుమతులు అందజేశారు.భారస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితమ్మ హరితమ్మ గారు మాట్లాడుతూ యువకులు క్రీడ రంగంలో అంతర్జాతీయ ఎదగాలని కోరారు.క్రీడలు ఆడడం వలన శరీర మంచిదని ఆరోగ్యాంగా ఉండడానికి తోడ్పడుతుందని తెలిపారు.యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి క్రీడలు అవసరం అన్నారు.ఈ కార్యక్రమాలలో అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు శ్రీ కటికనేని ప్రవీణ్ రావు,ఆర్గనైజింగ్ స్పాన్సర్ గుడిపుడి నవీన్ రావు,కుడితి మహేందర్ రెడ్డి,KSN రెడ్డి గారు దంపతులు జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా,ముత్యం వెంకన్న గౌడ్,మరిపెడ జడ్పీటీసీ శారదా రవీందర్ రెడ్డి,ఎంపీపీ అరుణ రాంబాబు,మరిపెడ మండల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్కొన్నారు.
చిన్నారిని ఆశీర్వదించిన జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితమ్మ
ఆదివారం రోజున మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మాలోత్ కవితమ్మ గారి వ్యక్తిగత సహాయకులు రాజబాబు గారి ముద్దుల చిన్నారి సారి సెర్మని కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ సంధర్బంగా భారాస రాష్ట్ర నాయకులు కేసముద్రం మాజి మార్కెట్ చైర్మన్,పర్కాల శ్రీనివాస్ రెడ్డి,KSN రెడ్డి,హరితక్క దంపతులు 1వ వార్డ్ కౌన్సిలర్ వెన్నం లక్ష్మ రెడ్డి,ముత్యం వెంకన్న,31 వ వార్డ్ కౌన్సిలర్ దాసరి ఆర్షిక-రావిష్,కేశవరావు అడ్వకేట్,పిల్లి సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.