గిరిజనులారా ఎవరు భయపడకూడదు..సాదిదం పట్టుదలతో
- ప్రైవేట్ గుండాల చేతిలో మానుకోట జిల్లా
- ఎంపిడిఓ కార్యలయం నిర్మాణం కోసం
- గిరిజన భూముల లాక్కోవడం దారుణం
- ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్,
- లంబాడా హక్కుల పోరాట సమితి(LHPS) జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్
మానుకోట Manukota Dist : మానుకోట జిల్లాలో అన్యాయంగా భూములు లాకుంటున్న ప్రవైట్ గుండాలు.గతంలో మెడికల్ కాలేజ్ పేరుతోటి గిరిజన భూములు లాక్కున్నది సరిపోక,మళ్లీ ఇప్పుడు ఎంపీడీవో ఆఫీస్ పేరు తోటి గిరిజన భూములు లాక్కోవడం దారుణమైన చర్యని బెళ్లయ్య నాయక్ గారు తీవ్రంగా ఖండించార. ప్రైవేట్ గుండాల చేతిలో మానుకోట బందీ అయిపోయింది అని ఆవేదన వ్యక్తంచేశారు.ఎమ్మెల్యే గుండాయిజం తోటి ఎంపీ,మంత్రులు సహకరిస్తున్నారని అన్నారు.అడిగిన ప్రతి ఒక్కరి మీద ప్రైవేట్ కేసులు బనాయించడం,బెదిరించడం,చంపడం,అమాయక గిరిజనులను మోసం చేయడం పద్దతి కాదు అని అన్నారు.అధికారులు దయచేసి ప్రజా ప్రతినిధులకు బానిసలు అవ్వకండి,మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్లిపోయేవారు.గిరిజనులారా మీరు ఎవరు భయపడకూడదు మీ వెంట కాంగ్రెస్ పార్టీ,అండగా ఉంటుందని,మరో పోరాటానికి సిద్ధం కావాలని బెళ్ళయ నాయక్ అన్నారు.