ఏక్మాయి గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- గెలుపొందిన వాళ్లకు బహుమతులు
- ప్రధాన ఉపాధ్యాయుయులు జగదీష్,ఉపాధ్యాయులు
- పాల్కొన్న గ్రామస్థులు,విద్యార్థులు
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.జాతీయగీతం అలకిస్తూ జండా ఎగురవేశారు.విద్యార్థులు ఆట,పాటలతో,నృత్యాలు వేశారు.మహా నేతలు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,గాంధీజీ,జాన్సీ లక్ష్మి భాయి,నెహ్రు ఇతర నేతల యొక్క స్వరూపంలో విద్యార్థులు అలంకరించారు.
నేతల స్వరూపంలో విద్యార్థులు అలంకరణ
అనంతరం ఆట పోటీలలో గెలుపొంచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సంధర్బంగా ఉపాధ్యాయులు అశ్మ,యువత శ్రావణి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్ధులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.విద్యార్థుల పట్ల ఉపాధ్యాయురాలు బాధ్యత తీసుకొని ఓపికతో స్నేహపూరితంగా చదువు చెపుతునందుకు ధన్యవాదాలు తెలిపారు.
జెండా ఎగురవేస్తున్న అంబేద్కర్ యువజన సంఘం
అనంతరం స్వీట్లు పంచి పెట్టారు.ఈ కార్యక్రమాలలో ప్రధాన ఉపాధ్యాయుయులు జగదీష్,ఉపాధ్యాయులు అశ్మ,అంబు రాజు,కిరణ్,శేఖర్,గ్రామ యువకులు కాశీనాథ్,మణి రత్నం,పోషమొళ్ళ శమప్ప,కమల్,చిన్న నర్సింలు,విజయ్ కుమార్,శ్రీకాంత్,సతీష్ కుమార్,వీరేశం,రమేష్ గ్రామ పెద్దలు విద్యార్థులు తదితరులు పాల్కొన్నారు.