Type Here to Get Search Results !

Sports Ad

ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు Grant of house plots to the homeless poor

 

ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు 

- తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చిన ఆర్పీఐ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు

ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధిలోని బుగ్గపాడు గ్రామంలోని సర్వే నంబర్.361 లో గల 1915 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని,ఆ భూమిని రుద్రాక్షపల్లి,బుగ్గపాడు,అభిపుర,నాగుపల్లి పాతురు,రేగల్లపాడు గ్రామాలకు చెందిన 500 మంది ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరారు.2021 నుండి జిల్లా కలెక్టర్ గారు,ఆర్డీవో గారు ఆదేశాలను ఫారెస్ట్ అధికారులు లెక్క చేయకుండా సర్వేకి రాకుండా నిరాకరిస్తున్నారు అని ఈ నెల 26 కల్ల సర్వే చేయాలని ఎమ్మార్వో గారిని కలవడం జరిగింది. స్పందించిన ఎమ్మార్వో గారు ఆర్డీవో గారితో మాట్లాడి ఆ భూములు సర్వే చేపిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఎమ్మార్వో గారికి,కల్లూరు ఆర్డీవో గారికి ఆర్పీఐ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల అధ్యక్షులు కూరం మహేంద్ర,ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి రవి,జోగి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies