వ్యాస రచన పోటీలు గెలుపొందిన హర్షిత,విమల
- బిఆర్ఎస్వి తాండూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం(Brsv) బిఆర్ఎస్వి తాండూర్ డివిజన్ కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ను గౌరవ మన తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తాండూర్ విద్యార్థులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యార్థులు బాగా చదివి మా తాండూర్ కి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు.కోకట్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించగా మొదటి బహుమతి హర్షిత రెండవ బహుమతి విమల అందుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి తాండూర్ డివిజన్ ఇంచార్జ్ జిల్లాని,పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు,మున్సిపల్ స్టార్టింగ్ కౌన్సిల్ న్యాయవాది కే.గోపాల్,పట్టణ కార్యదర్శి సంతోష్ గౌడ్,అబ్దుల్ సమద్,రజక,నరసింహ,అధ్యక్షులు ఎస్ రవీందర్,ప్రభుత్వ డిగ్రీల అధ్యక్షులు మజార్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.