పోలీసు అభ్యర్థులకు కీలక ప్రకటన
- కానిస్టేబుల్,ఎస్సై మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్
- తుది పరీక్షల తేదీలను టీఎస్పీఎల్ఆర్బీ ప్రకటించింది.
తెలంగాణ : కానిస్టేబుల్,ఎస్సై మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి.విద్యార్థులు డేట్స్ దృష్టిలో ఉంచుకొని చదుకోవడానికి సమయాన్ని ప్లాన్ ప్రకారం సద్వినియోగం చేసుకోవాలన్నారు.మార్చి 12,2023 నుంచి తుది పరీక్షలు ఉంటాయని తెలిపింది.ఎప్రిల్ 9న సివిల్ ఎస్సై మెయిన్స్,ఎప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది.ఉదయం 10 నుంచి 1వరకు పేపర్ 1 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 ఉంటుందని తెలిపింది.మెయిన్స్ పరీక్షలకు సంభందించి హాల్టికెట్ల డౌన్లోడ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని,ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ను చెక్ చేసుకోవాలని సూచించడం జరిగింది.అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రిలిమ్స్,దేహధారుడ్య పరీక్షలు రాసి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగాలకు శారీరక సామర్థ,దేహదారుఢ్య పరీక్షలు శనివారం ముగిశాయి.నియామక ప్రక్రియకు సంబంధించి ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హిమాయత్నగర్లో 'చలో డీజీపీ కార్యాలయం' కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో విద్యార్థి, యువజన సమాఖ్య ప్రతినిధులు డీజీపీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.