రాజకీయా నాయకులా ? లేకా వీధి రౌడీలా ?
ఆంధ్ర ప్రదేశ్ : మాచర్లలో వైసీపీలో భగ్గుమన్న విభేదాలు వెల్దుర్తి మండలం లో వైసిపి అదిపత్య పోరు శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి వర్గీయులు మధ్య ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చెలరేగిన వివాదం అది కాస్తా ఘర్షణకి దారితీసి ఒకరిపై ఒకరు దాడి దిగారు.విద్యార్థుల ముందే వీధీ రౌడీలు లాగా కొట్టుకున్న వైసీపీ నాయకులు విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసే విషయంలో గ్రామానికి చెందిన వైసీపీలోని రెండు వర్గాల వారు విడిపోయి బాహబాహికి దిగారు.ఈ ఘటనతో విద్యార్థులు పారిపోయారు.అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమర యాత్ర ర్యాలీ
రాజంపేట : విభజన హామీలు అమలు చేయాలని,ప్రత్యేక హోదా ఇవ్వాలని,కడప ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించాలని,రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల బుందేల్ఖడ్ ప్యాకేజీ ఇవ్వాలని,కేంద్ర విద్యాసంస్థలు నెలకొల్పాలని,పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని,రైల్వే జోన్,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని,తదితర విభజన హామీలు అమల కోసం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర రాజంపేటకు చేరుకున్న సందర్భంగా,ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్,డివైఎఫ్ఐ,ఏఐవైఎఫ్,పిడిఎస్యు,తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.విభజన హామీల ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్,తలసాని శ్రీనివాస్,హాజరయ్యారు.ఎస్ఎఫ్ఐ,రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ డివైఎఫ్ఐ,రామన్న,ఏఐవైఎఫ్,లెనిన్ బాబు,పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి సునీల్,ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య,సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు చిట్వేల్ రవికుమార్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ నరసింహ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంది కాళ్ళ మణి తదితరులు పాల్కొన్నారు.