గోదావరి నదిలో దూకి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య
నిర్మల్ Nirmal : నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది.నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.నిజామాబాదు జిల్లాకు చెందిన గోల్ హనుమాన్ పెద్ద బజారుకు చెందిన బాలాదిత్య భవ్య శ్రీ మానసలుగా గుర్తించారు పోలీసులు.భర్త కొన్ని సంవత్సరాలు క్రితం మృతిచెందడంతో మృతురాలు నిజామాబాదులోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తుంది.భర్త మృతి చెందినప్పటి నుండి తన అన్న ఇంటి వద్ద పిల్లలతో కలిసి ఉంటుంది.స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు.మృతికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ తెలియ రాలేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.