చంగేషపూర్ రోడ్ అద్వానం...ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణం
తాండూర్ : తాండూర్ పట్టణంలో ఎంతో కలంగా తాండూరు ప్రజలు ఎదురుచూస్తున్న అభివృద్ధి కొరకు ఇప్పుడు రోడ్ల విస్తరంలో తాండూరు పట్టణంలో వేగంగా సాగుతుంది.క్లాసిక్ గార్డెన్ నుంచి కింగ్స్ పాలస్ ఫంక్షన్ హాల్,చంగేషపూర్ రోడ్ పరిస్థితి అందరికి తెలిసిన విషయమే.నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వార్డ్ 19 క్లాసిక్ గార్డెన్ నుంచి కింగ్స్ పాలస్ ఫంక్షన్ హాల్ చంగేషపూర్ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించిన పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు,మరియు వార్డ్ 19 కౌన్సిలర్ ముఖ్తర్ నాజ్,పట్లోళ్ల నర్సింలు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఈ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు.తాండూరు ప్రముఖ వ్యాపార వేత్తలు గాఫోర్ పాషా,రమేష్ బూబ్,అబ్దుల్లాహ్ ముజాహిది మరియు ఇతర నపరాయి వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఅరెస్ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు,కౌన్సిలర్ ముఖ్టర్ నాజ్,మహమ్మద్ అసిఫ్,శ్రీనివాస్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు నర్సింలు,నరేందర్ గౌడ్,శ్రీనివాస్ చరీ మరియు తదితరులు పాల్గొన్నారు.