ఎమ్మెల్సీని కలసిన టిఆర్ఎస్ యువ నాయకులు
తాండూర్ : టిఆర్ఎస్ యువ నాయకులు శరత్ గారి నివాసంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి ఆహ్వానీంచి మర్యాదా పూర్వకంగా ఎమ్మెల్సీ గారి సన్మానించారు.అనంతరం వి6 టివి ఛానల్ ప్రతిని శివ ప్రసాద్ గారి నివాసంలో వారి కుటుంబ సభ్యుల తో కలవడం జరిగింది.అనంతరం తాండూర్ ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ లో ఓల్డ్ తాండూర్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారితో మర్యాద పూర్వకంగా కలసి అభివృద్ధి విషయాల పై చర్చించారు.యాలాల మండలం కమల్ పూర్ గ్రామంలో బిఅర్ఎస్ సీనియర్ నాయకులు ఈడిగ్గి లక్ష్మయ్య గౌడ్,అకాల మరణం చెందడం పట్ల వారి పార్థ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పార్థ దేహానికి పూలమాల వేసిన ఎమ్మెల్సీ
తాండూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు రాజీవ్,ఇందిరమ్మ కాలనిలోని హనుమాన్ దేవాలయ అభివృద్ధి కొరకు స్థానిక కౌన్సిలర్ వెంకన్న గౌడ్,హనుమాన్ దేవాలయం చైర్మన్ సాయప్ప,కాలనీ యువకులతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించి దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ గారు సహాయం అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.కౌన్సిలర్,దేవాలయ చైర్మన్ యువకులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.