తాండూర్ మునిసిపల్ ఛైర్ పర్సన్ పై అవిశ్వాసం
తాండూర్ : తాండూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ స్వప్న పరిమళ పై మునిసిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.జిల్లా కలెక్టర్ నిఖిల గారిని కలసి సమస్యల పై చర్చించిన అనంతరం కలెక్టర్ గారికి మొత్తం 23 మంది మునిసిపల్ కౌన్సిలర్ల సంతకాలతో అవిశ్వాస తీర్మానం అందజేశారు.తీర్మానం కు సంభందించిన వినతి పత్రం ను మొత్తం 19 మంది మునిసిపల్ కౌన్సిలర్లు పాల్గొని అందజేశారు.బిఆర్ఎస్,బీజేపీ,కాంగ్రెస్,ఎంఐఎం,టీజెఎస్ పార్టీలకు చెందిన 23 మంది కౌన్సిలర్లు అవిశ్వస తీర్మానం పై సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్, మునిసిపల్ వైస్ - చైర్మన్ దీపా నర్సిములు,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నయీమ్,నాయకులు సాయిపూర్ నర్సింలు,నరేందర్ గౌడ్ పలు పార్టీ నాయకులు పాల్కొన్నారు.