Type Here to Get Search Results !

Sports Ad

రైతన్న కష్టాన్ని తీర్చడానికే కెసిఆర్ KCR is the solution to farmers' problems

 

రైతన్న కష్టాన్ని తీర్చడానికే కెసిఆర్ 

బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో నవన్గి పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణ పనులకు ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్కొని శంకుస్థాపన చేశారు.ఈ మేరకు ఎమ్యెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు మన సీఎం కెసిఆర్ గారు.దేశంలో ఎక్కడ లేనంత విధంగా మన రాష్ట్రంలో రైతులకు రైతు బంధు,రైతు బీమా,రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అని తెలిపారు.రైతు దేశానికి ఎన్నెముక అని నిరూపిస్తున్నారు.పండించిన పంటలకు మద్దతు ధరలు రైతులకు ప్రతికూలంగా రైతు వేదికలు రైతన్నకు ఎలాంటి కష్టం రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని అన్నారు.అనంతరం మండల ఎంఆర్ఓ కార్యాలయంలో అర్హులైన వారికీ కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.పైలెట్ రోహిత్ మాట్లాడుతూ ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ మరియు పెన్షన్ ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో వృద్దులకు 2000/- అంగవైకల్యం వాళ్లకు 3000/- పెన్షన్ అందించడం ఆ ఘనత కెసిఆర్ దే అన్నారు.ఈ కార్యక్రమాలలో ఎంఆర్ఓ వెంకట్ స్వామి,డిప్యూటీ ఎంఆర్ఓ వీరేశం,అధికారులు పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,సర్పంచు ఎంపిటిసిలు జెడ్పిటిసిలు ప్రజలు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies