ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చిన కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్
వికారాబాద్ : ఫిబ్రవరి మూడో తారీకు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యల పైన చర్చించాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చిన కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.గీతా మరియు కేజీబీవీ సిబ్బంది.వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ RP ల సంక్షేమ సంఘం (MEPMA), తెలంగాణ ప్రగతిశీల KGBV నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU సంఘాల కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.కార్మిక సంఘాల వారు అందించిన వినతికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా తెలంగాణ ప్రభుత్వం
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
సోమవారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.59,06,844/- (రూపాయలు యాభై తొమ్మిది లక్షల ఆరువేల ఎనిమిది వందల నలభై నాలుగు) విలువ గల 59 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్ చెక్కులను అందజేశారు.తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా నిలుస్తూ ప్రతి దశలో ఆడబిడ్డలకు తోడుగా సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ గారు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.