మద్దిశెట్టికి అండగా అన్ని కుల సంఘాల నాయకులు
- గిరిజన పోడు రైతులు,గిరిజన పూజారులు
భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజినాపురం గ్రామానికి చెందిన భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు గారిపై తేదీ 27.01.2023 నాడు పెనుబల్లి పోలీస్ స్టేషన్లో అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగిందని, అట్టి కేసుని వెంటనే రద్దు పరచాలని మా నాయకుడిని ఎటువంటి విచారణ జరపకుండా ఎటువంటి వివరణ అడగకుండా రాత్రికి రాత్రి ఎస్సీ ఎస్టీ కేసు ఎలా చేస్తారని ఆ కేసును వెంటనే తీసివేయాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించడానికి గిరిజన పూజారులు పోడు పోరాట కమిటీ నాయకులు బీసీ సంఘాల నాయకులు మైనార్టీ సంఘాల నాయకులు ఈ రోజు సుమారు 1000 మంది జనం మద్దిశెట్టి సామేలు గారి ఇంటికి రావడం జరిగింది.
సామెలు గారి మీద కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1,50,000 మంది కార్యకర్తలు సామాన్యంగా అండగా ఉన్నారని,డిసెంబర్ 10వ తారీకు జరిగిన సత్తుపల్లిలో జరిగిన ప్రోగ్రామే దీనికి నిదర్శనమని 20,000 మందితో ర్యాలీ తీసిన వాళ్ళం 20,000 మంది వెళ్లి హైదరాబాద్ డిజిపి గారి ఆఫీసు ముందు కూర్చొని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఎస్ఐపై సీఐపై తప్పుడు కేసు పెట్టినందుకు వారిద్దరు సస్పెండ్ చేయాలని కూర్చోవడం మాకు పెద్ద పని కాదంటూ కానీ మా నాయకుడు అట్లా మాకు చేయమని నేర్పలేదు అంటూ తప్పుడు కేసిన సవాల్ చేస్తూ గౌరవ హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరుగుతుందని కేవలం ఫిబ్రవరి నెల మూడో తారీకు ఆర్పిఐ పార్టీ రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగకుండా ఆపాలని మా నాయకుడు మద్దిశెట్టి సామెల్ పై తప్పుడు కేసు పెట్టారని అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఇంకా కొంతమంది ఒక పదిమంది బ్యాచి రెడీ అయి గుమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడెక్కడ అయితే కేసులు పెట్టియాలని ప్లాన్ తో తిరుగుతున్నారని వారి పూర్తి అడ్రస్ లు మాకు తెలుసు అని ఎల్లకొచ్చి మరి లాగి గుంజుపట్టి కూర్చోబెట్టి లీగల్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు అధికారులు దగ్గర కూర్చుంటామని తెలియజేస్తున్నామని సత్తుపల్లి ఏసిపి గారి దగ్గరికి ఈరోజు బయలుదేరడం జరిగింది.
కాబట్టి సామెల్ అన్న మీద పెట్టినటువంటి కేసుని తప్పుడు కేసుని రద్దు పరచాలని 1,50,000 మంది కార్యకర్తలు ఉన్న మా దగ్గర ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకొని మద్దిశెట్టి సామేలు కేవలం పెనుబల్లి మండలంలో తీసుకుంటున్నాడా ? ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మార్చి నెల కొత్తగూడెం జిల్లాలోని 30 వేల మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని మా నాయకుడి మీద ఎటువంటి కేసులు పెట్టినా దాడులు చేసిన బెదిరింపులకు దిగిన ఎవ్వర్నీ వదిలిపెట్టమని చెప్పి ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొట్టి మీరు ఇబ్బందులు గురికావద్దని చెప్పి హెచ్చరిస్తూ భారతీయ సర్వసమాజ్ మహా సంఘం రాష్ట్ర కమిటీ హెచ్చరించడం జరిగింది.