Type Here to Get Search Results !

Sports Ad

మంత్రివర్యులు శ్రీ రాందాస్ గారిని కలిసిన మద్దిశెట్టి,ఆర్పీఐ Maddisetty,RPI Team met Ministers Ramdas

 

మంత్రివర్యులు శ్రీ రాందాస్ గారిని కలిసిన మద్దిశెట్టి,ఆర్పీఐ

ఖమ్మం : శుక్రవారం రోజున మద్దిశెట్టి మరియు ఆర్పీఐ పార్టీ టీమ్ కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ రాందాస్ అతవాలే గారిని కలిసి గ్రామ సమస్యల విషయం పై చర్చించారు.రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు తీసుకున్నందుకు మంత్రి గారు అభినందనలు తెలియజేశారు.న్యూఢిల్లీలోని వారి ఛాంబర్ లో కలివడం జరిగింది.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఇళ్ళ స్థలాల విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని,500 మంది ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయాలని కోరడం జరిగింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా,ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు,2005 కంటే ముందు నుండి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా హక్కులు కల్పించాలని,గిరిజన పుజరాలకు మౌలిక సదుపాయాలు,నెలసరి వేతనాలు అందించే విధంగా సంబంధిత అధికారులకు లేఖ రాయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు,నేషనల్ కౌన్సిల్ మెంబర్ కొంపల్లి ప్రభుదాస్,ఎండీ.ఫయాజ్,పలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies