Type Here to Get Search Results !

Sports Ad

తోట చంద్రశేఖర్ కలిసిన ఎమ్మెల్యే పైలెట్ MLA Pilot met BRS AP State President Thota Chandrasekhar

 

 తోట చంద్రశేఖర్ కలిసిన ఎమ్మెల్యే పైలెట్

తాండూర్ : తెలంగాణ సీఎం కెసిఆర్ ద్వారా ఇటీవల నియమితులైన బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారిని మరియు బీఆర్ఎస్ జాతీయ నాయకుడు రావెల కిషోర్ బాబు తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి పంజుగుల గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా భారతదేశ దశ-దిశ మార్పుకోసం,పార్టీ పటిష్టత చేయడంలో మరియు తదితరాంశాలపై వారు చర్చించారు.


మొట్టమొదట ముస్లిం మహిళ ఉపాధ్యాయులు

షేక్ ఫాతిమా పుట్టినరోజు సందర్భాన్ని( DOB 09/01/1831) పురస్కరించుకొని వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ ఇన్చార్జ్ జిలాని ఒక ప్రకటనలో తెలిపారు ముఖ్యంగా వారం రోజులపాటు ఆమె యొక్క జీవిత చరిత్ర పై వ్యాసరచన క్విజ్ పాటల పోటీలు మరియు ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు షేక్ ఫాతిమా ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేయడం జరిగిందని మహిళలు చైతన్యం కావాలని విద్య నేర్చుకోవాలని ఆమె చెప్పేవారు కులరహిత సమాజం కోసం మరియు బాలికల విద్య కోసం నిరంతరం కృషి చేశారు ఫాతిమా షేక్ భారతదేశ మొట్టమొదట ముస్లిం మహిళ ఉపాధ్యాయులు కావున ఆమె యొక్క జన్మదిన సందర్భంగా ఆమె బాలికలు మహిళా విద్య కోసం ఎంతో కృషి చేయడం జరిగింది కాబట్టి ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies