పువ్వుల వర్షంతో ఘన స్వాగతం పలికిన ప్రజలు
- జన నేతకు అడుగడుగునా జన నీరాజనాలు
- కోట్పల్లి మండల కేంద్రానికి కోటి రూపాయలు
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ
తాండూర్ : పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాకతో ఘనంగా డబ్బులతో ఘన స్వాగతం పలికారు. కోట్పల్లిలో పర్యటించిన గౌరవ ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం జరిగింది కోట్పల్లి మండల కేంద్రానికి కోటి రూపాయలకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్యెల్యేకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.అన్నాసాగర్ గ్రామాలకు శివాజీ విగ్రహాలు కావాలని యువత కోరగా వెంటనే మంజూరు చేసిన ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఓగ్లాపూర్ లో పైలెట్ రోహిత్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆదర్శనంగా తీసుకోవాలన్నారు.
అలాగే దళిత బంధు దుఖాణాలను ప్రారంభించారు.ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో 50 కుటుంబాలు బీఆర్ఎస్ లోకి చేరికలు అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని నమ్మకంతో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తాండూరు ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు.శుక్రవారం తాండూరు టౌన్ 7వ వార్డుకు చెందిన విజయనగర్ కాలనీకి చెందిన దాదాపు 50 ఫ్యామీలకు చెందిన వంద మందికి పైగా సంచార జాతుల మందుల సంఘం అధ్యక్షులు ఓరగంటి ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎమ్యెల్యే గారి సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరారు. వారిని ఎమ్యెల్యే బీఆర్ఎస్ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు.మహిళలకు పెద్ద పీట వేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పురుషులతో సమానంగా మహిళలు కూడా బీఆర్ఎస్ లోకి చేరడం బీఆర్ఎస్ అభివృద్ధకి నిదర్శనం అన్నారు.
ప్రతి ఒక్క కార్యకర్తని కడుపున పెట్టుకుని చూసుకుంటానన్నారు.జాయినింగ్ అనంతరం కాలనీలోని పలు సమస్యలను ఎమ్యెల్యే గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది.అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఎమ్యెల్యే గారు వెంటనే కాలనీకి మినీ వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు,చెత్త బండ్లు వచ్చేలా,అంగన్ వాడీ స్కూల్ తదితర సమస్యలను అప్పటికప్పుడే జారీ చేస్తానని తెలిపానే.దీంతో సంతోషం వ్యక్తం చేసిన కాలనీ వాసులు ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జై రోహిత్ అన్నా అంటూ నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.ఈ కార్యక్రమంలో సంచార జాతుల మందుల సంఘం ఉపాధ్యక్షులు ఓరగంటి సంజీవ,దానియలు,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.