Type Here to Get Search Results !

Sports Ad

ప్రతీ గ్రామం రూపు రేఖలు మారుస్తా MLA Rohith Reddy

 

ప్రతీ గ్రామం రూపు రేఖలు మారుస్తా

- కంటి వెలుగు దేశానికే ఆదర్శం
- ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూర్ : కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తాండూరు ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు.సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని గురువారం తాండూరు నియోజకవర్గంలోని మారేపల్లి తాండా,చంద్రవంచ,తాండూరు టౌన్,బషీరాబాద్,బాణాపూర్ గ్రామాల్లో ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డి గారు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని తెలిపారు.కంటిచూపు బాగుంటేనే ఆ ఇంటిని చక్కదిద్దుకుంటారని తద్వారా ఆ కుటుంబం బాగుంటుందన్నారు.ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇతర రాష్ట్రాల సీఎంలు ప్రశంసిస్తున్నారని చెప్పారు.ఈ క్రమంలోనే ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి మన కంటి వెలుగు కార్యక్రమం చాలా అద్భుతమన్నారు.


ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్థులు 


సీఎం కేసీఆర్ గారు ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి అని తెలిపారు.కంటి వెలుగుతో పాటు అన్ని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఘనత మన తెలంగాణకే దక్కడం మన అదృష్టమన్నారు.కంటి సమస్యపై ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే వేలకు వేల ఫీజులు ఉంటాయని చిన్న పరీక్ష చేయించుకోవాలన్న దాదాపు రూ.40 వేల దాక అవుతున్నాయన్నారు.ఇప్పడు ఉచితంగా మన ఊరికే వచ్చి, పరీక్షలు చేసి కళ్ల అద్దాలు ఇస్తున్నారని అవసరమైతే హైదరాబాద్ లో సర్జరీ చేయించే గొప్ప కార్యక్రమం కంటి వెలుగు అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉచిత క్యాంపును సధ్వినియోగం చేసుకోవాలని సూచించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అభివృద్థి అని ఈ క్రమంలోనే మన తాండూరుకు కనీవిని ఎరుగని రీతిలో రూ.135 కోట్లు మంజూరయ్యాయని తద్వారా ప్రతీ గ్రామం రూపు రేఖలు మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies