Type Here to Get Search Results !

Sports Ad

బద్లాపూర్ తండా గ్రామంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి MLC Mahendhar Reddy

 


బద్లాపూర్ తండా గ్రామంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

- రెండో విడతగా కంటి వెలుగు కార్యక్రమం
- అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి   

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోనీ బద్లాపూర్ తండా గ్రామంలో మారుమూల ప్రాంతాలకు కూడా కంటి వెలుగు కార్యక్రమం రెండో విడతగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కంటి పరీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఇలాంటి కంటి వెలుగు కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన కార్యక్రమం కంటి వెలుగు,కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ సిఎం కేసీఆర్ గారికి,అలాగే హరీష్ రావు గారి ఈ కార్యక్రమం చేపట్టి నందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న PACS వైస్ చైర్మెన్ అజయ్ ప్రసాద్,సురేందర్ రెడ్డి,బాద్లాపూర్ సర్పంచ్ నీలా పోల్ సింగ్ నాయక్,కాసింపూర్ సర్పంచ్ వెంకటయ్య,గొట్టిగకూడదు సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,మాసంపల్లి సర్పంచ్ గొల్ల భీమప్ప,కంసాన్పల్లి సర్పంచ్ అనురాధ వెంకటరెడ్డి,కొట్లాపూర్ సర్పంచ్ రవీందర్,నాయకులు చందర్ నాయక్,మాణిక్ రెడ్డి,బద్లాపూర్ సర్పంచ్ సుభాష్,సేవియా నాయక్,మోహన్ నాయక్, శ్రీను నాయక్,మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్,అగ్గానూర్ సర్పంచ్ భీమప్ప,బి జె యదప్ప,అశోక్,వెంకటయ్య, యువ నాయకులు సిద్రాల శ్యామ్,బి.రఘు,పునీత్ కుమార్,ఇర్ఫాన్,సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.


కమల్ అక్తర్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ

– కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ

వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కమల్ అక్తర్ ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు.కమల్ అక్తర్ సతీమణి,నిన్న అనారోగ్యంతో హైదరాబాద్ లో బుధవారం కన్నుమూశారు.అట్టి విషయాన్ని  తెలుసుకొని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,ఈ రోజు బిఅర్ఎస్ నాయకులు మసూద్ గారి సోదరుడు కమల్ అక్తర్ గారి నివాసానికి చేరుకొని వారి కి  పరామర్శించారు. అయన సతీమణి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.ఎమ్మెల్సీ వెంట, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావూఫ్,మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్,కౌన్సిలర్స్ మణ పురం రాము,వెంకన్న గౌడ్, బోయ రవి రాజు,మసూద్,మాజీ జడ్పీటిసి సిద్రాల శ్రీనివాస్,నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.


ఫోటోకి పూలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ 

ఈ రోజు ఓల్డ్ తాండూర్ మాజీ కౌన్సిలర్ కమలమ్మ గారి మొద్దటి సంత్సరం సందర్భంగా వారి ఫోటోకి పూలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు,మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న,కౌన్సిలర్స్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి,మణపురం రాము,వెంకన్న గౌడ్, బోయ రవి రాజు,సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సింహులు,పట్లోళ్ళ బాల్ రెడ్డి,మాజీ జడ్పీటిసి సిద్రాల శ్రీనివాస్,ఇందురు ప్రకాష్, తదితరులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


పట్నం సునీతమ్మ చేతుల మీదుగా ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణ

2023 నూతన సంవత్సర ఆర్టిఐ లైవ్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను గురువారం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్టిఐ జిల్లా రిపోర్టర్ అరుణ్ రెడ్డి,మరియు జర్నలిస్టు మిత్రులు విశ్వనాథం,రవి,వెంకట్,అశోక్,చంద్రశేఖర్,స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies