పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
- మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ను పరామర్శించారు
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తాండూరు : తాండూరు మండలం చిట్టి ఘనపూర్ గ్రామంలో బసి రెడ్డి గారికి తల్లి అమృతమ్మ నిన్న రాత్రి అకాల మరణం చెందడం పట్ల ఈరోజు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉదయం వారి నివాసానికి చేరుకొనీ పార్థ దేహాన్నికి పూలమల వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం యాలాల్ మండలం బాణపూర్ లో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారి వారి తండ్రి వర్త్య వల్ల్యా నాయక్ గారు,మొన్న అకాల మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు.పేద్దేములు మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ మహిళ అధ్యక్షురాలు ఎర్ర రత్నమ్మ గారు నిన్న రాత్రి అకాల మరణం చెందడం పట్ల ఈరోజు ఉదయం వారి నివాసానికి చేరుకొని రత్నమ్మ మృత దేహాన్ని పూలమల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు,PACS చైర్మెన్ సురేందర్ రెడ్డి,బాణపూర్ సర్పంచ్ బాలి బాయ్,రాము నాయక్,సీనియర్ నాయకులు రాజు నాయక్,బి.రఘు,నరేష్ కుమార్,సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి కరణం పురుషోత్తం రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,మాజీ ఎంపిటిసి వెంకటప్ప,ప్రభాకర్ రెడ్డి,శేకర్,సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షలు డివై నర్సింహులు,మాజీ సర్పంచులు సంఘం అధ్యక్షుడు బాల్వంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుజ్జమ్మ, మాజీ సర్పంచ్ ఎర్ర బలప్ప,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఇందుర్ ప్రకాష్,యువ నాయకులు మహిపాల్ రెడ్డి,అజమ్ ఖాన్,కుమ్మరి విఠల్,కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.