ఎస్పీ కోటిరెడ్డి కుటుంబాన్నికి పరామర్శ
సూర్యాపేట : దిశదిన కర్మ నంద్యల కోటిరెడ్డి తండ్రి చిత్రపటం వద్ద మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నివాళుర్పించారు.ఎస్పీ కోటిరెడ్డి తండ్రి హనుమా రెడ్డి మృతి పట్ట ఎమ్మెల్సీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఎస్పీ స్వగృహం సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామం మాజీ ఎంపిపి కరణం పురుషోత్తం రావు, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్ తో కలిసి హనుమారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కోటిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.ఘాట్ కేసర్ మండలంలోని ప్రతాప సింగారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి గారి తల్లి మనెమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వారి నివాసంలో వారి తల్లి గారి ఫోటోకి పూలు వేసి నివాళులు అర్పించారు.బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.