పేదలను మోసం చేస్తున్న వాలంటీరు
ఆంద్ర ప్రదేశ్ : ప్రభుత్వం నుండి పింఛన్ల ఇస్తున్నారు.అదే ఆసరాగా తీసుకొని నకిలీ నోట్లు పంచుతూ అడంగ బుక్కయ్యాడు.పింఛన్ల పంపిణీ సమయంలో నకిలీ నోట్లు రావడంతో ప్రజలు షాక్ అయ్యారు.వెంటనే వాలంటీరుకు సమాచారం ఇచ్చారు.వాటిని పరిశీలించారు ఇలా మొత్తం ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్లందరి దగ్గర నుంచీ వాటిని తిరిగి తీసుకున్నారు.ఈ మోసపూరితమైన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో చోటు చేసుకుంది.మొత్తం 38 నోట్లను ఉన్నాయని గుర్తించారు.పేదలకు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు కలకలం రేపాయి.ఎస్సీ కాలనీలో వాలంటీరు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.ఓ లబ్ధిదారు పింఛను నగదుతో లావాదేవీ చేస్తుండగా నకిలీ నోటు అని గుర్తించాడు.ఈ విషయాన్ని వాలంటీరు దృష్టికి తీసుకురాగా పంపిణీ సొమ్ములో మరికొన్ని నకిలీ నోట్లు కనిపించాయి.పింఛన్ల నగదులో 500 రూపాయల నకిలీ నోట్లు 38 వరకూ గుర్తించారు.పంపిణీ చేస్తున్న వాలంటీరు పై అధికారులకు అప్పగించారు.