Type Here to Get Search Results !

Sports Ad

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు రేవంత్ రెడ్డి Revanth reddy

 

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు రేవంత్ రెడ్డి 

- బిజెపి కాంగ్రెస్ కుట్రలో భాగంగా
- పిసిసి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలపై కేసు పెట్టడం 

తాండూర్ : తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు బిజెపి ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారంలో కుట్రలను బయటపెట్టినందుకు బిజెపి ప్రభుత్వం కావాలని ఈడి మరియు సిబిఐ వాళ్లతో దాడి చేయిస్తుంది.మరోపక్క కావాలని మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను రేవంత్ రెడ్డి బిజెపి వాళ్లకు అమ్ముడుపోయి ఎమ్మెల్యేలపై కేసు పెట్టడం జరిగింది ఈ విషయంపై తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే అది మాట్లాడకుండా బిజెపి కుట్రలను బహిర్గతం చేసిన వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కనుమరుగు అవుతుంది అది గ్రహించకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు ఇలాంటి చర్యలను తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు కావున పైలట్ రోహిత్ రెడ్డి గారి పైన బిజెపి మరియు కాంగ్రెస్ ముక్కుమ్మడి దాడి చేసిన భయపడేది లేదు తాండూర్ ప్రజలు ఈ చర్యలను తిప్పి కొట్టి రోహిత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు.రోహిత్ రెడ్డి గారి హయాంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా తాండూర్ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇది గిట్టని వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా తాండూర్ ప్రజలు నమ్మరు కావున రేవంత్ రెడ్డి గారు మొదటగా తన పార్టీ ఎలా బలోపేతం చేయాలో ఆలోచించాలి అని సూచిస్తున్నాం.ఈ కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆనంద్,కోటపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా,ఉపాధ్యక్షులు మోసిన్,కార్యదర్శి సుశీల్ కుమార్,యువజన సంఘం అధ్యక్షులు మంగలి నాగేష్,జి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies