Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ లో వాలీబాల్ టోర్నమెంట్ పట్నం రినిష్ రెడ్డి Rineesh Reddy Volleyball Tournament in Basheerabad

 

బషీరాబాద్ లో వాలీబాల్ టోర్నమెంట్ పట్నం రినిష్ రెడ్డి

బషీరాబాద్ : బషీరాబాద్ మండలంలో సిపిఎస్ పాఠశాలలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగిన సంధర్బంగా ముఖ్య అతిథిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి తనయుడు పట్నం రినిష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.పట్నం రినిష్ గారికి ఘనంగా స్వాగతం పలికిన బషీరాబాద్ మండలం నాయకులు,యువ నాయకులు.అనంతరం స్వామి వివేకానంద గారికి పూలమాలవేసి వేసిన పట్నం రినిష్ రెడ్డి వివేకానంద స్ఫూర్తితో అందరూ మెలగాలి అని కోరారు.వాలీబాల్ టోర్నమెంట్ క్రీడా స్థాయిలో పాల్గొని ఇలాంటి జిల్లా క్రీడా స్థాయిలో,రాష్ట్ర స్థాయిలో ఎదగాలని కష్ట పడితే ఏదైనా సాధించగలం అని సలహాలిచ్చారు.అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అలగే ముందుగా భోగి,సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన రినిష్ రెడ్డి 

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,శ్రావణ్ కుమార్,బన్సీలాల్, వడ్డే హనుమంతు,చందర్, సుదర్శన్ రెడ్డి,నర్సింలు,మల్లప్ప,నాయక్ యువ నాయకులు అనుదీప్,రియాజ్,నరేష్ శ్రీకాంత్ రెడ్డి సాజిద్, ఆదామ్,సాయి ప్రసాద్,వాజిద్,ఇర్ఫాన్,మోసీన్ ఖాన్,నిసార్ ఖాన్,మాడి వికరమ్ రెడ్డి,యువ నాయకులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies