సేవాలాల్ జయంతిని సెలవు దినం... లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన
- ముందస్తు అరెస్టు అప్రజాస్వామికం
- సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
- ప్రకటించక పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం
- రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘాల హెచ్చరిక
తాండూర్ : గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం లో భాగంగా తాండూర్ నియోజక వర్గం గిరిజన సంఘాల నాయకులను తాండూర్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.ఈ సందర్బంగా గిరిజన నాయకులు,ప్రకాశ్ రాథోడ్,భాను పవార్,అరుణ్ కుమార్,రమేశ్ రాథోడ్,ధనరాజ్ పవార్,రాంజీ రాథోడ్,మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు.దేశంలో రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాల ఉద్యమ కారులు,సామాజిక,ఆద్యాత్మిక,వేత్తలు,స్వాతంత్ర సమర యోధుల జయంతి,వర్ధంతి రోజులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించింది.దేశ వ్యాప్తంగా 12 కోట్ల గిరిజన బంజారాల ఆరాధ్య దైవం,సామాజిక వేత్త,ఆద్యాత్మిక గురువు,అయినటువంటి సంత్ శ్రీ సేవాళాల్ జయంతి ని సెలవు దినంగా ప్రకటించక పోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివక్షతకు నిదర్శనం అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు పరిపాలన కొనసాగించాలి అని దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవలాల్ జయంతినీ సెలవు దినంగా ప్రకటించడం డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనా చేపడు తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.