Type Here to Get Search Results !

Sports Ad

ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గఫర్ నడుస్తున్నా పాదయాత్రలు TDP Nara Lokesh

 

ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గఫర్ నడుస్తున్నా పాదయాత్రలు 

* ఇసుకేస్తే రాల‌నంత జ‌నం హాజ‌ర‌య్యారు
* కంచుకోట‌కి మారుపేరు కుప్పం
* తెలుగుదేశం కంచుకోట కుప్పం 
* యువ‌గ‌ళం..మ‌న గ‌ళం..ప్ర‌జాబ‌లం
* అన్న ఎన్టీఆర్‌ది చైత‌న్య‌ర‌థం చంద్ర‌న్న‌ది వ‌స్తున్నా మీ కోసం
* యువ‌గ‌ళం స‌భ‌లో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ 

కుప్పం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర శుక్ర‌వారం కుప్పంలో ఆరంభ‌మైంది.ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి చేసిన హ‌క్కుతో పాద‌యాత్ర చేస్తున్నా యువ‌గ‌ళం పేరు ప్ర‌క‌టించ‌గానే వైసీపీ నేత‌ల ప్యాంట్లు త‌డిశాయి ప‌ది మంది మంత్రులు నాపై విమ‌ర్శ‌ల దాడి చేశారు.ఏ హ‌క్కుతో పాద‌యాత్ర చేస్తార‌ని న‌న్ను ప్ర‌శ్నిస్తున్నారు వైసీపీ నేత‌లు.25 వేల కిలోమీట‌ర్లు సీసీ రోడ్లు వేయించిన ఘ‌న‌త నాది 25 ల‌క్ష‌ల వీధి దీపాలు వేయించాను.ఐటీలో న‌ల‌భై వేల మందికి ఉద్యోగాలు క‌ల్పించిన మంత్రిగా వ‌స్తున్నాను.ఎల‌క్ట్రానిక్స్ రంగంలో 40 వేల ఉద్యోగాలు క‌ల్పించింది నేనే మూడుశాఖ‌ల మంత్రిగా చేసిన అభివృద్ధి హ‌క్కుతో పాద‌యాత్ర చేస్తున్నాను.వైసీపీ పాల‌న‌లో రాష్ట్రానికి ఏం పీకార‌ని ప్ర‌శ్నిస్తున్నాను ? వైసీపీ మంత్రుల్లా వీధుల్లో డ్యాన్సులు వేస్తే ప‌రిశ్ర‌మ‌లు రావు కేసినోలు న‌డిపితే ప‌రిశ్ర‌మ‌లు రావు మంత్రి గారూ.

ఒక్క చాన్స్ జ‌గ‌న్ రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెన‌క్కి తీసుకెళ్లాడు.పొట్టి శ్రీరామ‌లు త్యాగంతో ఏర్ప‌డింది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్టీఆర్ కృషితో తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం పెరిగింది.చంద్ర‌న్న పాల‌న‌తో దేశ‌మే కాదు ప్ర‌పంచానికే మ‌న ఖ్యాతి పెరిగింది.అర‌వై ఏళ్ల‌కి పైగా ముఖ్య‌మంత్రులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి పాటుప‌డ్డారు ఒక్క చాన్స్ పేరుతో వ‌చ్చిన జ‌గ‌న్ త‌న మూడున్న‌రేళ్ల పాల‌న‌లో రాష్ట్రాన్ని నాశ‌నం చేశాడు.67 సంవ‌త్స‌రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని వెన‌క్కి తీసుకుపోయాడు జ‌గ‌న్‌ ఉద్యోగులు,విద్యార్థులు,రైతులు,మ‌హిళ‌లు అంతా ఈ ప్ర‌భుత్వం బాధితులే ప్ర‌భుత్వం అవినీతిపై మాట్లాడితే కేసులు- ఉద్య‌మిస్తే జైలు.రాష్ట్రం ప‌రిస్థితిపై యువ‌త ఆందోళ‌న‌లు చూశాక వ‌చ్చిన ఆలోచ‌నే యువ‌గ‌ళం ప్ర‌భుత్వ అరాచ‌కాలు,అవినీతిపై పోరాడే యువ‌త‌కు యువ‌గ‌ళం ఓ వేదిక‌.


జ‌నాన్ని మోసం చేసిన జాదూ రెడ్డి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే జాదూ రెడ్డి గుర్తొస్తాడు.మైసూర్ బోండాలో మైసూరు ఉండ‌దు జాదూరెడ్డి జాబ్ క్యాలెండ‌ర్లో ఉద్యోగాలు ఉండ‌వు గ్రూప్1,2 నోటిఫికేష‌న్ల‌లో 36 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డానికి సిగ్గులేదా జాదూరెడ్డి.జాదూరెడ్డి యువ‌కుల్ని మోస‌గించాడు పాద‌యాత్ర‌లో ప్ర‌తీ గ‌డ‌ప ఎక్కి 2.30 ల‌క్ష‌లు ప్ర‌భుత్వ ఉద్యోగాలు తీస్తాన‌ని హామీ ఇచ్చిన జాదూరెడ్డి ఏమైంది నీ హామీ? ప్ర‌తి ఏటా ఇస్తాన‌న్న జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంది.ఏటా 6500 కానిస్టేబుల్ పోస్టులు భ‌ర్తీ చేస్తాన‌న్న జాదూ రెడ్డి ఒక్క పోస్ట‌యినా భ‌ర్తీ చేశాడా.మెగా డిఎస్సీ అన్నాడు ద‌గా చేశాడు.జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఉద్యోగాలు రాలేద‌నే నిరాశ‌తో 300 మంది యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు.జె ట్యాక్స్ ఫుల్లు ఉపాధి నిల్లు జె ట్యాక్స్ కోసం వేధింపులు తీవ్రం కావ‌డంతో రిల‌య‌న్స్‌,ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ ,హోలీ టెక్‌,మెగా సీడ్ పార్క్‌, అమ‌ర‌రాజా కూడా ప‌క్క రాష్ట్రాల‌కు త‌ర‌లిపోయాయి చిత్తూరు జిల్లాలో వేలాది మందికి ఉపాధి క‌ల్పించిన అమ‌ర్ రాజా ప‌రిశ్ర‌మ‌ని ప‌క్క రాష్ట్రాల‌కు త‌రిమేశారు.ప్ర‌జాధ‌నం తీసుకునే జీత‌గాడు స‌జ్జ‌ల అమ‌ర‌రాజా పోలేదు, మేమే పంపేశామ‌ని గొప్ప‌గా చెప్పుకోవ‌డం మ‌న దౌర్భాగ్యం అమ‌ర‌రాజా వెళ్లిపోవ‌డంతో 10 వేలు ఉద్యోగాలు మ‌న యువ‌త కోల్పోయారు.ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ బై బై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని చెప్పేసి త‌ర‌లిపోతున్నాయి.



అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ చేసి చూపించిన వ్య‌క్తి చంద్ర‌బాబు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ చేసి చూపించిన వ్య‌క్తి మ‌న అధినేత చంద్ర‌బాబునాయుడు.అనంత‌పురంన‌కు కియా మోటార్స్‌,బ‌ర్జ‌ర్ పెయింట్స్‌,జాకీ గార్మెంట్స్‌ క‌డ‌ప జిల్లాకి స్టీల్ ప్లాంట్, చిత్తూరు జిల్లాకి ఫాక్స్ కాన్, సెల్ కాన్‌, డిక్స‌న్, జోహో కంపెనీలు తీసుకొచ్చారు.క‌ర్నూలు జిల్లాకి సిమెంట్ కంపెనీలు, సోలార్ ప‌వ‌ర్ ప్లాంటు, మెగా సీడ్ పార్క్ ఏర్పాటు అయ్యాయి.నెల్లూరు జిల్లాకి శ్రీసిటీ, హీరో మోటార్స్‌,అపోలో టైర్స్‌,సుజ‌లాన్ తెచ్చారు ప్ర‌కాశం జిల్లా పేప‌ర్ మిల్లు, గోదావ‌రి జిల్లాలు-ఉత్త‌రాంధ్ర‌కి అనేక ప‌రిశ్ర‌మ‌లు తెచ్చారు.ఐదేళ్లలో 5 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘ‌న‌త మా తెలుగుదేశం ప్ర‌భుత్వానిది.ఇదీ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అంటే మూడు రాజ‌ధానులు అంటున్న జాదూరెడ్డి ఒక్క ప‌రిశ్ర‌మా తేలేదు.ఒక్క ఇటుకా పెట్ట‌లేదు.జ‌గ‌న్ కేసుల కోసం జ‌నం ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టు ప్ర‌త్యేక‌హోదా వ‌స్తే ఉద్యోగాల వ‌ర్షం కురుస్తుంద‌ని మాయ‌మాట‌లు చెప్పాడు జాదూ రెడ్డి ఏమైంది ప్ర‌త్యేక హోదా  ప్ర‌త్యేక‌హోదా కోసం ఢిల్లీ మెడ‌లు వంచుతాన‌ని కేసుల కోసం జ‌గ‌నే మెడ వంచేశాడు.జ‌గ‌న్ కేసుల వ‌ల్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోల్పోయింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies