తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణ : తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది.పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరుగుతాయి.మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి జరుగుతాయి.ఏప్రిల్ 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులను ఇవ్వనున్నారు.
శుభాకాంక్షలు తెలిపిన శివ వర్మ నాయక్
మహబూబాబాద్ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ గా DR. బెల్లయ్య నాయక్ గారు ఎన్నికయ్యారు.జాతి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేశారు. వారికి లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LSO) మహబూబాబాద్ జిల్లా శివ వర్మ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.
యాలాల్ లో కామాంధుడి కారులో బాలిక లైంగిక దాడి |