విరాళంగా 20వేల రూపాయలు అందించిన ఏడవల్లి
కొత్తగూడెం : సీతారామ లక్ష్మణ హనుమాన్,ముత్యాలమ్మ,బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని టిపిసిసి జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ పూజలు నిర్వహించారు.కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామ పంచాయితీ తెలగ రామవరం లో సీతారామ లక్ష్మణ హనుమాన్ ముత్యాలమ్మ బొడ్రాయి ప్రతిష్ఠి మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ కార్యక్రమములో కమిటీ సభ్యులు ముందుగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఏడవల్లి కి సన్మానం కార్యక్రమము చేశారు,గుడి నిర్మాణం నిమిత్తం ఏడవల్లి కృష్ణ కమిటీ సభ్యులకు 20వేల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమములో లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరరావు,పాల్వంచ పట్టణ బీసీ సెల్ అద్యక్షులు చారి,కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి సత్యనారాయణ,హామచంద్రపురం బీసీ సెల్ నాయకులు జక్కుల శ్రీనివాస్,కరుకొండ ఎస్టీ సెల్ నాయకులు మలోత్ లక్ష్మణ్,గడ్డిగుట్ట నరేష్,కమిటీ సభ్యులు పురుషోత్తం,నారాయణా,చంద్రగిరి హరికృష్ణ,చంద్రగిరి శ్రీను,తదితరులు పాల్గొన్నారు.