హైదరాబాద్ లోని 21 న రాష్ట్ర కమిటీ సమావేశం
ఖమ్మం : ఈ నెల 21 న భారతీయ సర్వ సమాజ్ మహాసంగ్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ లోని మీడియా ప్లస్ లో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 2.00 ల వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి BSSM నేషనల్ చైర్మన్ మరియు భారత ప్రభుత్వ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ FAF శ్రీ రామ్ కుమార్ వాలియ గారు వారితో పాటు BSSM కి సంబందించిన ఒక ఎమ్మెల్యే హజరవనున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ నాయకులు జిల్లాకి 100 మంది చొప్పున ముఖ్య కార్యకర్తలు హాజరు కావాలని, బాధ్యతలు తీసుకున్న వారు మాత్రమే మీటింగ్ కి హాజరు కావాలని పిలుపునివ్వడం జరిగింది.BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు,ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తాడెం జై కుమార్,ఏపీ బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్,మైనారిటీ నాయకులు ఎండీ. ఫయాజ్ అధికారులు తదితరులు పాల్కొన్నారు.