కులాంతర వివాహం...3లక్షల నగదు..!! ఎమ్యెల్యే పైలట్
- కులాంతర వివాహలకు అండగా బీఆర్ఎస్ సర్కార్
- తాండూరుకు చెందిన విజయ్ కుమార్ దంపతులు
- రూ.3లక్షల నగదు ప్రోత్సాహకం
- ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur : తాండూర్ పట్టణంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తాండూరు ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డి గారు తెలిపారు.తాండూరుకు చెందిన విజయ్ కుమార్ 2 సంవత్సరాల క్రితం మెదక్ కు చెందిన మహిళను కులాంతర వివాహాం చేసుకున్నాడు.వారికి 6 నెలల ఒక బాబు ఉన్నాడు.మంగళవారం వీరికి తాండూరుకు ఎమ్యెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు రూ.3 లక్షల 1 వెయ్యి 21 చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్యెల్యే కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు ఇబ్బంది పడకుండా ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తూ ఆదుకుంటుందని తెలిపారు.గతంలో నామమాత్రంగా ఉన్న ఈ ప్రోత్సాహకాన్ని సీఎం కేసీఆర్ రూ.3 లక్షలకు పెంచారు.తద్వారా ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు,చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని జీవించేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్ దంపతులు సీఎం కేసీఆర్,ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.