జయసుధ అమెరికా పౌరుడితో మూడో వివాహం?
- భర్త మరణంతో జయసుధ తల్లడిల్లిపోయారు
- మూడో వివాహం చేసుకొన్నారని సన్నిహితులు వెల్లడించారు
- అనంతరం నిర్మాత నితిన్ కపూర్తో పెళ్లి
అయితే నితిన్ కపూర్తో జయసుధ జీవితం బ్రహ్మండంగా సాగుతున్న సమయంలో ఆమెకు భారీ షాక్ తగిలింది.మానసిక రుగ్మతలతో,ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న నితిన్ కపూర్ ముంబైలోని ఓ భారీ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేసింది.భర్త మరణంతో జయసుధ తల్లడిల్లిపోయారు.ఆమె సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా రోజులు పట్టిందనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడించాయి.
భర్త మరణంతో జయసుధ డిప్రెషన్లో ఉన్న సమయంలో తన స్నేహితుడు, సన్నిహితుడు ఆమెకు అండగా నిలిచారు.ఆమెను మామూలు మనిషిగా చేయడంలో ఆయన తన వంతు ప్రేమను,అభిమానాన్ని చూపించారు. దాంతో వారిద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది.దాంతో తన స్నేహితుడిని మూడో వివాహం చేసుకొన్నారని సన్నిహితులు వెల్లడించారు.అయితే తన మూడో వివాహానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదనే విషయంలో లోప్రొఫైల్లో ఉంచారని చెబుతున్నారు.
అయితే వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచే జయసుధ ఇటీవల వారసుడు ప్రెస్ మీట్కు భర్తతో కలిసి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. మీడియా వారిద్దరిని కెమెరాలో బంధించడంతో జయసుధ మూడో పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. అయితే జయసుధ పెళ్లి చేసుకొన్నాదా? లేదా మానసికంగా బాధలో ఉన్న జయసుధకు ఆమె స్నేహితుడు జీవితంలో తోడుగా ఉన్నారా అనేది విషయంపై క్లారిటీ లేదు. జయసుధ అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ విషయంపై క్లారిటీ రాదు అని మీడియా వర్గాలు అంటున్నారు.
వారిసు చిత్రం లో జయసుధ అద్బుతంగా నటించింది.జయసుధ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది. తల్లి, వదిన, అమ్మమ్మ పాత్రలతో తనదైన శైలిలో మెప్పిస్తున్నారు. ఆమె నటించిన వారిసు చిత్రం ఇటీవల రిలీజైంది. దళపతి విజయ్కి తల్లిగా నటించిన జయసుధ అద్బుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల గుండెను పిండేశారు. ఇంకా పలు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.
Good Nice
ReplyDelete