బిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ కె.గోపాల్
తాండూర్ : తాండూర్ పట్టణంలో కె.గోపాల్ కార్మిక విభాగం నియోజిక వర్గ అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము 2022 -23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 2,30,396 కోట్ల బడ్జెట్లో డెబ్బై శాతం నిధులను కేవలం సంక్షేమ రంగానికి కేటాయించడం చాలా హర్షించ దగ్గ విషయం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మరొక్కసారి కేసీఆర్ ప్రభుత్వం మరొక్కసారి నిరూపించుకున్నది. 80,000 మంది ఉద్యోగులను రెగ్యులర్ ప్రాతిపదికన 11,000 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరిసే చేయడానికి 1000 కోట్లు కేటాయించడం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని నిరూపించుకుంది.స్వంత ఇల్లు లేనివారికి ఇంటి జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి 7980 కోట్లు కేటాయించడం,7500 కోట్లు రుణమాఫీకి.సర్ఫ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ పేస్కేలు వర్తింప చేయడం ఏప్రిల్ ఒకటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు వచ్చేటట్లు చూడడం చాలా సంతోషకరం కార్మిక పక్షపాతి అని కేసీఆర్ మరొక్కసారి నిరూపించుకున్నారు.అడగకుండానే ప్రజా అవసరాలు గుర్తించి అన్ని కల్పిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా ఉంది అని తెలిపారు.