చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
కోటపల్లి : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.కోటపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఎన్నికల కోడ్ ఉండడం ద్వారా విగ్రహం ఆవిష్కరణ వాయిదా పడింది.మండల కేంద్రంలో జయంతి సందర్భంగా శివాజీ ప్రతిమకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ మహారాజ్ నాడు వీరోచిత పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలిచి సమ సమాజ నిర్మాణం చేయుటకు ఎంతో కృషి చేశారు. వారి జీవిత చరిత్రను నేటి యువత మననం చేసుకుని వారి ఆశలను నెరవేర్చే విధంగా సమాజం పట్ల అవగాహన పెంచుకొని వారి ఆశలను నెరవేర్చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ఎస్ఎంసి చైర్మన్ యాదగిరి, గ్రామ పెద్దలు సూరయ్య గౌడ్, కృష్ణ కుమార్, మోసిన్, రవి గౌడ్, నిఖిల్, తమ్మలి శ్రీనివాస్,శేఖర్,సుశీల్ కుమార్, మంగలి నాగేష్,అనిల్ కుమార్, దినేష్ కుమార్, ఉప్పరి రమేష్,రవి కుమార్, బందప్ప, శివాజీ యువజన సంఘం అధ్యక్షులు మహేష్ గౌడ్, కిషోర్, హరి, శివకుమార్, బ్రహ్మం, దిలీప్,గోపాల్, చిన్న, ఆదిల్, శ్రీనివాస్, సాయి గౌడ్, సురేష్ శివాజీ యువజన సంఘం సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.