గడప గడపకు కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్ర
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
- ఏక కాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ
- ఇంటి నిర్మాణానికి కోసం రూ. 5 లక్షలు
- ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
- రూ.500 కే గ్యాస్ సిలిండర్
- కాంగ్రెస్ అధ్యక్షులు జి.మధుసూధన్ రెడ్డి
- కొండా ప్రశాంత్ రెడ్డి
దేవరకద్ర : భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామంలో నేడు ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను, రాహుల్ గాంధీ గారి సందేశాన్ని గడపగడపకు చేరవేసే ఉద్దేశంతో తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రజల కష్ట, సుఖాలను తెలుసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో పర్యటించిన పేద ప్రజలకు అండగా ఉంటామని భరోసానిచ్చరు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ,ఇంటి నిర్మాణానికి కోసం రూ. 5 లక్షలు,ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం,రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హాత్ సే హాత్ జోడో యాత్ర లో గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను ప్రజలకు వివరించిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి.మధుసూధన్ రెడ్డి (GMR), కొండా ప్రశాంత్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి,RGBS జనరల్ సెక్రెటరీ కిరణ్, RGBS రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల సిద్దేశ్వర్, టీపీసీసీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండా జగదీశ్వర్, భూత్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట నర్సింహ రెడ్డి, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హర్యా నాయక్ మరియు మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వివిధ మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.