"తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ పాత్ర "వ్యాసం
- కేసీఆర్ గారు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
- గెలిచిన విద్యార్థులకు బహుమతులు
- కేజీ టు పీజీ విద్యా సంస్థలు ఏర్పాటు
- తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకో రావాలని
తాండూర్ : తాండూర్ పట్టణంలో కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ డివిజన్ కమిటీ ఇన్చార్జ్ జిలాని ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ రోడ్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గల సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ పాత్ర అనే అంశంపై ఎస్సే రైటింగ్ ఉపన్యాసం నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది.మరియు అదే విధంగా తరగతిలో వారీగా క్లాస్ ఫస్ట్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం ముఖ్య అతిధి బిఆర్ఎస్ పార్టీ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దానిలో భాగంగానే కేజీ టు పీజీ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.వైస్ ఎంపీపీ గారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు తీసుకో రావాలని అన్నారు.అనంతరం విద్యార్థి విభాగం ఇన్చార్జ్ జిలాని మాట్లాడుతూ దేశంలో ఎక్కలేని విధంగా 1000కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి కార్పో రేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో యాలాల మండల వైస్ ఎంపీపీ రమేష్,స్థానిక సర్పంచ్ పురుషోత్తం రెడ్డి,8 పార్ట్ కౌన్సిల్ వెంకన్న గౌడ్,బెన్నూర్ సర్పంచ్ పటేల్ రెడ్డి,అరవింద్ రెడ్డి,బిఆర్ఎస్ యువ నాయకులు కృష్ణ,ప్రిన్సిపల్ అరుణ,ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.