Type Here to Get Search Results !

Sports Ad

కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం Fire at New Secretariat

 

కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు.ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజు కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు.సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లోనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్.బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్. జేడీ(యు) అధ్యక్షుడు లలన్ సింగ్.అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ లు హజరు కానున్నారు.అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా యుద్ధనౌక గద్దర్ సీఎం కేసీఆర్ను కోరారు.ఈ మేరకు తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ భవన్ గా నామకరణం చేసింది ప్రభుత్వం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies