ప్రజల కోసమే పైలట్ రోహిత్ రెడ్డి
- రేపటి తరాల గురించి ఆలోచించడమే నిజమైన నాయకుడి లక్షణం
- అభివృద్ధి అజెండాతోనే ప్రజల్లోకి
- ప్రతి వార్డుకి కోటి రూపాయల నిధులు
- మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
తాండూర్ : తాండూర్ పట్టణంలోని 3,18,25,వ వార్డులలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ప్రత్యేక నిధులతో త్రాగనిటి బోర్లను మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు వేయించారు.ఈ సంధర్బంగా మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు మాట్లాడుతూ అభివృద్ధి అజెండాతోనే ప్రజల్లోకి మరియు అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో అనే పదానికి నిదర్శనం ఎమ్మెల్యే పైలెట్ అని తెలిపారు.ఎమ్యెల్యే పైలట పనితీరుపై ప్రజలు ప్రశంసలు వ్యక్త పర్చారు.లాంఛనంగా ప్రారంభమైన త్రాగునీటి బోరు పనులు వరుసగా 4 రోజులుగా 15 బోర్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశానుసారంగా వేయించారు.గల్లీ గల్లీ పైలెట్ కార్యక్రమంలో దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తున్నారు.పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుకు అంగన్వాడీ,డ్వాక్రా భవనాలు,ప్రతి వార్డుకి కోటి రూపాయల నిధులతో మారుతున్న రూపురేఖలు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాయీమ్ అప్ఫు,కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్,భీంసింగ్ రాథోడ్,నాయకులు గుండప్ప,సమద్,మొయిజ్,టైలర్ రమేష్,ఇమ్రాన్,సోహేల్,అక్బర్,అశ్ఫక్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మర్యాదపూర్వకంగా కలిసిన కోటపల్లి నాయకులు
తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్,కోటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు ఆనంద్, సీనియర్ నాయకులు సమ్మయ్య, బుగ్గాపురం ఇంచార్జ్ నర్సింలు గౌడ్, మత్స్య సహకార సంఘం డైరెక్టర్లు, సాయిబ్రామ్, మొగులయ్య, సత్యనారాయణ,మబ్బుల్, రామచందర్ తదితరులు కలిశారు.