వాహనం దొరికితే భారీ మూల్యం చెల్లాల్సిందే
* వాహనదారులు సకాలంలో పన్ను చెల్లించాలి
* జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి
వికారాబాద్ Vikarabad news : వికారాబాద్ జిల్లాలో మొత్తం 4769 పన్ను చెల్లించని వాహనాలు తిరుగుతున్నాయి అలాంటి వాహనాలు తనిఖీలు పట్టుబడితే 200 రూపాయలు అపరాధ రుసుముతో మొత్తం 300 రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తుందని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వాహనాలకు సంబంధించి సుమారు 3,50,23.190 రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయని, వాహన యజమానులు సకాలంలో పనులు చెల్లించాలని తెలిపారు.రవాణా వాహనాల పన్నులు కోట్ల రూపాయలలో పెరుకుపోవడంతో ఉన్నత అధికారుల ఆదేశాలతో ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేయడం జరిగిందన్నారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రమాణ వాహన యజమానులు పన్నులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకు పోతున్నాయని మార్చి-2023 వరకు పూర్తి పన్ను బకాయలు వసూలు చేయాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పన్ను బకాయలు ఉన్న వాహనదారులు తమంత తాముగా ఈ సేవ కేంద్రంలో పన్ను చెల్లిస్తే బకాయాలకు 50 శాతం అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది లేకపోతే వాహనదారులు తనిఖీలో పట్టుబడితే మాత్రం 200 శాతం రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అయన తెలిపారు.