దారుణమైన ఘటన..కంటి చూపు లేని యువతిని..నరికి చంపిన రాజు
- 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో
- అతి కిరాతకంగా నరికి చంపిన రాజు అనే యువకుడు
- గొడ్డలితో తలపై అనేకమార్లు నరకటం
క్రైమ్ : కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపిన రాజు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అసభ్యంగా ప్రవర్తించి ఆమె హత్యాయత్నం చేశాడు.రాజు ప్రవర్తనపై అమ్మకి పెద్దమ్మకి తెలియచేసిన యువతి.రాజుని నిలదీసిన తల్లి నాకే పాపం తెలీదు రాణి నా చెల్లి లాంటిది అని నమ్మ పలికిడు కానీ ఐదు నిమిషాల్లోనే విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో టెడ్డీబేర్ తో ఆడుకుంటున్న రాణిని గొడ్డలితో అతి దారుణంగా తలపై అనేకమార్లు నరకటంతో అక్కడే ఉన్న స్థానికులు హుటా హుటిన ఆసుపత్రి తరలించిన దక్కని ప్రాణం.మార్గ మధ్యలోనే మరణించింది.హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అనే పోలీసుతో పాటు వారి ఇంటి సమీపంలో వివాహిత మీద గొడ్డలితో దాడి చేసిన ఘటనలు చూసి విచారించారు.రాజుకి పోలీసులతో ఉన్న స్నేహాల వల్ల ఇలాంటి దారుణాలు తెగబడుతున్నాడని తమ ఆవేదన వ్యక్తపరచుకున్న స్థానిక ప్రజలు.కళ్ళు కానరాని నా కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్వతమైన కుటుంబ సభ్యులు.పోలీసుని కొట్టినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఇలాంటి దుర్ఘటన జరిగే కాదని ఇతని వల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదమే అని తమ ఆవేదన వ్యక్తం.కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.