బషీరాబాద్ పరిధిలోని రైతులకు మోసం...
- శనగల కొనుగోలు విషయంలో పిఎసిఎస్ సంఘం
- శనగల బస్తాలను తూకంలో అవకతవకలు
బషీరాబాద్ : రైతులను మోసం చేస్తున్న పిఎసిఎస్ సంఘం.ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండలంలోని పిఎసిఎస్ సొసైటీ నందు రైతుల యొక్క శనగల కొనుగోలు విషయంలో పిఎసిఎస్ సంఘంలో తూకములు నిర్వహించే కూలీలు అయినా1. దీపక్ కుమార్, 2. రవీందర్ బిందా, మరియు పిఎసిఎస్ సొసైటీలో సీఈఓ గా పని చేస్తున్నటువంటి వెంకటయ్య మరియు మరికొందరు కలిసి, పర్వత్ పల్లి మరియు నవల్గా గ్రామానికి చెందిన రైతుల వద్ద శనగల బస్తాలను తూకంలో అవకతవకలు నిర్వహించి రైతులను మోసగించి అట్టి మోసగించిన ధాన్యాన్ని వేరే వాళ్లకు అమ్ముకొని డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో అట్టి కూలీలు శనగల తూకంలో అవకతవకలు నిర్వహించారు అని బషీరాబాద్ మండల పిఎసిఎస్ చైర్మన్ అల్లాపురం వెంకట్రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నట్లు బషీరాబాద్ ఎస్సై పి.విద్యాచరన్ రెడ్డి తెలిపారు.