Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ రోడ్లను పట్టించుకోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి In Basheerabad

 

బషీరాబాద్ రోడ్లను పట్టించుకోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

- సున్నం పట్టి నుండి మొదలుకొని గ్రామపంచాయతీ దాకా రోడ్లు
- తెదేపా సీనియర్ నేత ఎంశ్రీనివాస్

బషీరాబాద్ : తాండూర్ నియోజకవర్గంలో చూసినట్లయితే రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయని చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అన్నారు.ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేపర్ టీవీలలో చెప్పడమే తప్ప అభివృద్ధి లేదు.బషీరాబాద్ ఎమ్మెల్యే సొంత మండల్ ఒక కిలోమీటర్లో ఆయన గ్రామం బషీరాబాద్ రోడ్లు చూసినట్లయితే సున్నం పట్టి నుండి మొదలుకొని గ్రామపంచాయతీ దాకా రోడ్లు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి.టు వీలర్,ఫోర్ వీలర్ వాహనాలు నడపడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఎన్నికల టైంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నేను స్థానికుని అని చెప్పిన నీ మాయమాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఎక్కడున్నావ్ రోహిత్ రెడ్డి ఇదే రోడ్ల మీద హైద్రాబాద్ నుండి వస్తావు పోతావు కంటికి కనపడడం లేదా అని అడుగుతున్న అభివృద్ధి చేయడం మరిచి మీ వర్గ పోరుతో మరియు ఎవ్వరికీ పార్టీ కండువ కప్పలో అనే బిజీగా ఉన్నారు.

మరికొందరు అధికార అండతో రాత్రిపూటలో ఇసుక దందాలో బిజీగా ఉన్నారని అన్నారు.మరి ఎమ్మెల్యే గారు ఎన్నికలు ఇంకా దగ్గర వచ్చినంక రోడ్లు వేస్తే ప్రజలు గుర్తిస్తారని అనుకుంటున్నారేమో నీ నటన అందరికీ అర్థమైంది నిన్ను అందరు గమనిస్తున్నారు.ఎందుకంటే పోయిన ఎన్నికల్లో చాలామంది పెద్దలు యువకులు కష్టపడి గెలిపిస్తే వాళ్లకి గుర్తించకుండా విశ్వాసం పెట్టని నీవు.ఆనాడు కొందరు మహేందర్ రెడ్డి గారి వెనకాల ఉన్నవాళ్లు కొందరు ఈ రోజు నీ వెనకాల ఉన్నారు వాళ్ళు ఉన్నది దళిత బంధు కోసం మరికొన్ని స్కీంల కోసం తప్ప మరొకటి కాదని అన్నారు.తాండూర్ నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారు నిన్ను ఓడించడానికి యువకులు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు.ఈ రోడ్లు తొందరలోనే వెయ్యకపోతే రోడ్డుపైనే యువకులతో కలిసి ధర్నా చేస్తాం అని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies