భర్తను చంపిన భార్య
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
- సేవించే మందులో విషం కలిపిన భార్య
- భార్య అక్రమ సంబంధమే కారణం
మేడ్చల్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ఔషపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న మౌలాన్-శాంతి కుటుంబం.శాంతి తన ప్రియుడు బాబుతో అక్రమ సంబంధం పెట్టుకొని గత కొన్ని రోజులుగా పలుమార్లు ఇంట్లో గొడవలు జరగడంతో విసిగెత్తిన భార్య శాంతి,తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది.భర్త సేవించే మందులో విషం కలిపిన భార్య శాంతి ప్రియుడు బాబు శాంతి విషయం బయటకు రాకుండా తన భర్త కడునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన పోలీసులు మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఆచార్య పోయిన పోలీసులు.మొదట విచారణ నిమ్మిత్తం భార్య శాంతి అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి.పోలీసుల అదుపులో భార్య శాంతి తన ప్రియుడు బాబు తమ అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు బాబుతో కలిసి భర్తను చంపినట్లు ఒప్పుకున్న భార్య శాంతి.వీరి పై కేసు నమోదు చేశారు.