హోంశాఖ మంత్రిని కలిసిన ఆర్పిఐ పార్టీ టీమ్
హైదరాబాద్ : హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్పిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారు ఆర్పిఐ పార్టీ టీమ్.అనంతరం సామాజికంగా అభివృద్ధి పనుల విషయం చర్చించారు.
ఈ నెల 22న బి.సి సభ ఏర్పాటు విజయవంతం చేయాలి
హైదరాబాద్ : జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ.ఆర్.కృష్ణన్న చేతుల మీదుగా ఛలో మంగళగిరి బి.సి హక్కుల సాధనకై బి.సి సేన ఆధ్వర్యంలో జరిగే సభకు ఆహ్వానించటం జరిగింది. వారి చేతుల మీదుగా హైదరాబాద్ లో వారి నివాసంలో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ నెల అనగా ది. 22-02-23నాడు మంగళగిరిలో బి.సి సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో బి.సి సభ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సభకు ముఖ్య అతిధిగా రావాలంటూ ఈ రోజు వారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.
బి.సి నాయకులపై ఖమ్మం జిల్లా లోని అక్రమంగా SC. ST కేసు నమోదు చేసిన విషయాన్ని ఆర్. కృష్ణయ్య గారు తీవ్రంగా ఖండించారు. ఒక బి.సి నాయకుడిపై ఎటువంటి విచారణ లేకుండా ఒక్క రోజులోనే ఏ విధంగా FIR చేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయం మీద DGP గారికి లేఖ రాస్తామని, మద్దిశెట్టి సామేల్ పై పెట్టినటువంటి అక్రమకేసును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో AP బి.సి సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు గౌడ్, పున్నం రామచంద్రరావు గారు, దేవరాజు గట్టు శివ గారు, పలగాని శ్రీనివాసరావు గారు, గరిడేపల్లి రవి తదితర బి.సి నాయకులు వీరితో పాటు RPI పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు బి.సి నాయకులు పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారు పాల్గొన్నారు.