Type Here to Get Search Results !

Sports Ad

నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్ in hyderabad

 

నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : విద్యార్థిని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నరు.ప్రీతికి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ వైద్యులను ఆదేశించారు.ప్రీతి తల్లి తండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చిరు.హైదారాబాద్ నిమ్స్ హాస్పటల్  చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్   పరామర్శించారు.అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్  మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నం సంఘటన చాలా బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘ‌టనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేప‌డుతోందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్  వరంగల్ కమిషనర్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.  వైద్యులతో గంట గంటకు మంత్రి హరీష్ రావు స్వయంగా మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారని సత్యవతి రాథోడ్ వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి 

* పెళ్లి వేడుకలో పేలిన గ్యాస్ సిలిండర్

* తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల 

* తాండూర్ లో దట్టమైన పొగలతో జిప్సం ఫ్యాక్టరీ


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies