కలెక్టర్ కార్యాలయం పైకెక్కి..పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం
జనగామ : జనగామ పట్టణంలో ఇద్దరు భార్యాభర్తలు భూసమస్య తీర్చాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు.జనగామ కలెక్టర్ కార్యాలయం పైకెక్కి భూసమస్య పరిష్కరించాలని ఇద్దరు భార్య భర్తల హల్చల్ చేశారు.ఎమ్మర్వో తమ భూమిని ఇతరులకు అక్రమ పట్టా చేసారని,తమ సమస్య పరిష్కారించాలని ఎన్నో సార్లు ఎమ్మర్వో కోరిన చేయలేదు.అందుకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.గతంలో కూడా ఆత్మహత్యయత్ననికి పాల్పడిన బాధితుడు నర్సింగరావు.ఇప్పటికైనా మా సమస్య తీర్చాలంటూ బాధితులు కోరారు.